అంతర్జాతీయ స్థాయిలో సూర్యాపేట బిడ్డ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన పురస్కారం

September 5, 2026 0 Comments

— చిలీలోని UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ అవార్డు సాధించిన డా. ప్రవీణ్ బర్మావతు— ఘనంగా సత్కరించిన యూనివర్సిటీ రెక్టర్ మారిసోల్ డురాన్ శాంటిస్ కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చి, అంతర్జాతీయ పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్ బర్మావతుకు విదేశీ గడ్డపై అరుదైన పురస్కారం లభించింది. సౌత్ అమెరికా దేశమైన చిలీలోని ‘యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా’ (UTEM) ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో …

టీచర్స్‌ డే కానుకగా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్ లుక్!

September 5, 2026 0 Comments

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఆవిష్కరణ హైదరాబాద్‌: జాతీయ అవార్డు గ్రహీత నవీన్‌ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్‌’ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తుండగా.. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి తాత పాత్రలో, సత్యం రాజేష్‌ పాఠశాల ఉపాధ్యాయుడిగా కీలక పాత్రలు …

మహిళా ప్రొడక్షన్ వర్కర్స్ అధ్యక్షురాలు లలితపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

September 4, 2026 0 Comments

తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. యూనియన్ అధ్యక్షురాలు లలితపై పలువురు మహిళా కార్మికులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో అత్యవసర మీడియా సమావేశం నిర్వహించి అధ్యక్షురాలి వైఖరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన విషయాలు & ఆరోపణలు:ఆర్ధిక పారదర్శకత లోపం: సభ్యులు ఏడాదికి ₹5,000 చొప్పున చందా చెల్లిస్తున్నారని, గత పదేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ-వ్యయాల వివరాలు, యూనియన్ ప్రాపర్టీ (ఆస్తులు) …

ఎంఎస్ వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణంలో హీరోగా ఫోక్ స్టార్ కిట్టు పవన్.. క్లాప్ కొట్టిన ఆస్కార్ విజేత చంద్రబోస్!

August 29, 2026 0 Comments

ఫోక్ స్టార్ కిట్టు పవన్ కథానాయకుడిగా యం.ఎస్‌. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 3) శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ముని శివ, శివమల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌ సాయి నాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ జానపద గేయాలతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. అంగరంగ …

ప్రమాదం తర్వాత నేనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లా.. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నా: సంజుష్

August 21, 2026 0 Comments

ప్రమాదం తర్వాత పారిపోలేదు.. భారతి ముఖిని కాపాడేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లా: సంజుష్ హైదరాబాద్: మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై లగ్జరీ స్పోర్ట్స్ కారు నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజుష్ స్పందించారు. ఈ ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి అనే యువతి మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారును జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడిపినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ ఘటనపై …

మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్

April 12, 2026 0 Comments

▪️ హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్▪️ హజ్ యాత్రికులకు ఉచిత పరీక్షలు.. మెడికల్ కిట్లు▪️ హెల్త్ క్యాంప్ ప్రారంభించిన టీజీఎంఎఫ్‌సీ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ హైదరాబాద్: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్‌ను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్ ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో …

అయ్యన్నపాత్రుడికి మద్దతుగా నిలిచిన నర్సీపట్నం దళిత సంఘాలు

April 4, 2026 0 Comments

మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలి: డిమాండ్ నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితుల పట్ల జరిగిన అన్యాయాలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. డాక్టర్ సుధాకర్ మృతిపై మౌనం ఎందుకు? దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి చెందిన …

దక్షిణాసియా టెక్స్‌టైల్స్ రాజధానిగా తెలంగాణ

April 3, 2026 0 Comments

▪️ 2047 నాటికి లక్ష్యాన్ని సాధిస్తాం..▪️టెక్స్‌ టైల్స్ మా డీఎన్ఏలో ఉంది▪️’గ్రీన్ టెక్స్‌ టైల్ హబ్‌లను’ ప్రోత్సహిస్తాం..▪️పారిశ్రామికవేత్తలకు ఇదే మా ఆహ్వానం▪️ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్‌ టైల్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 13వ ఏషియా టెక్స్‌ టైల్ సదస్సు (ATEXCON 2026) లో పాల్గొన్న ఆయన, ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి …

అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణ: మార్చి 16న తెలుగు జాతి గర్వించే మహోత్సవం

March 14, 2026 0 Comments

అమరావతి: తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారీ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” పేరుతో మార్చి 16న ఆవిష్కరించనున్నారు. విగ్రహం విశేషాలు:ఎత్తు: పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల కోసం 58 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, ఈ …

వైసీపీ నాయ‌కులపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

March 5, 2026 0 Comments

అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర ఎద్దేవా చేశారు. 33 రోజులు తనను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించి, అణువణువూ జల్లిడపట్టినా ఒక్క తప్పూ దొరకలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై తప్పు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. …